అక్షరగళం :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై విధించిన 50 శాతం సుంకాలను రద్దు చేయాలని కోరుతూ ముగ్గురు అమెరికా చట్టసభ సభ్యులు నిన్న ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ టారిఫ్లు చట్టవిరుద్ధమని, అమెరికా కార్మికులకు, వినియోగదారులకు, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని వారు ఆరోపించారు.
కాంగ్రెస్ సభ్యులు డెబోరా రాస్, మార్క్ వీసే, రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆగస్టు 27, 2025న అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద భారత్పై అదనంగా విధించిన 25% సుంకాలను రద్దు చేయాలని ఈ తీర్మానం లక్ష్యంగా పెట్టుకుంది. అంతకుముందు విధించిన సుంకాలను కలుపుకొని భారత ఉత్పత్తులపై మొత్తం టారిఫ్లు 50 శాతానికి చేరిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యురాలు డెబోరా రాస్ మాట్లాడుతూ, “భారత కంపెనీలు మా రాష్ట్రమైన నార్త్ కరోలినాలో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. వేలాది ఉద్యోగాలు సృష్టించాయి. ఈ టారిఫ్లు మా ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తున్నాయి,” అని అన్నారు. మరో సభ్యుడు మార్క్ వీసే స్పందిస్తూ, “భారత్ మాకు ముఖ్యమైన భాగస్వామి. ఈ చట్టవిరుద్ధ సుంకాలు ఇప్పటికే అధిక ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై మరింత భారం మోపుతాయి” అని తెలిపారు.
భారత్పై సుంకాలు చట్టవిరుద్ధం
RELATED ARTICLES

