మెస్సీ మేనియాలో కొట్టుకుపోయిన ఫుట్బాల్ అభిమానులు
మొదటి గోల్ చేసిన రేవంత్ రెడ్డి… మెస్సీ రెండు గోల్స్
అభిమానులను అర్రూతలూగించిన రేవంత్ రెడ్డి-మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్
కిక్కిరిసిన ఉప్పల్ స్టేడియం
ఆకట్టుకున్న మంగ్లీ, సిప్లిగంజ్ మ్యూజిక్ షో
అరుదైన మ్యాచ్కు వేదికగా నిలిచిన ఉప్పల్ స్టేడియం

ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో అరుదైన మ్యాచ్కు వేదికగా నిలిచింది ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా మొదటి గోల్ చేశారు. తర్వాత ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కూడా రెండు గోల్స్ సాధించారు. గోట్ కప్ పేరుతో ఈ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా మెస్సీ, రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. సింగరేణి ఆర్ఆర్ జట్టు తరఫున రేవంత్ రెడ్డి, అపర్ణ జట్టు తరఫున లియోనల్ మెస్సీ ఆడారు. మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో వీరిద్దరూ బరిలో దిగారు. రేవంత్ రెడ్డి వచ్చీ రావడంతోనే గోల్ కొట్టి అలరించారు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు జట్లతో కలిసి రేవంత్ రెడ్డి, మెస్సీ ఫొటోలు దిగారు. ఇద్దరూ స్టేడియంలో కలియతిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కుమారుడు, కుమార్తె ఈ ఫుట్బాల్ మ్యాచ్ను వీక్షించారు.
మ్యాచ్కు ముందు స్టేడియంలో మ్యూజికల్ నైట్, లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాహుల్ సిప్లిగంజ్ నాటు నాటు పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మంగ్లీ, సిప్లిగంజ్ తమ ఫోక్ సాంగ్స్తో అలరించారు.

