పాసులుంటేనే ఎంట్రీ…
మెస్సి- గోట్ ఫుట్ బాల్ మ్యాచ్ కి పాస్ లేకుంటే నో ఎంట్రీ
శనివారం తెలంగాణ సీఎం – మెస్సితో జరగబోయే మెస్సి- గోట్ ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద రద్దీ ఏర్పడకుండా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
టికెట్, పాసులు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందని మిగతా వారికి ఎట్టి పరిస్థితి లో అనుమతి ఉండదని సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. ఈ నెల 13న జరుగుతున్న ఈ మ్యాచ్ కు అత్యంత కట్టుదిట్టమైన, భారీ బందో బస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. అభిమానులు సహకరించాలని ఆయన కోరారు.


#TelanganaSports #UppalStadium #FootballMatch #TeamTelangana #SportsForAll #DSB #FootballHyderabad

