ఘనంగా శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి మహా పడి పూజకార్యక్రమం
పాల్గొన్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు, సీనియర్ నాయకుడు గుబ్బల లక్ష్మీనారాయణ
కసాల మోహినిష్ రాజ్ కన్నె స్వామి వారి తల్లిదండ్రులు ఆశీస్సులతో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. బొలిశెట్టి దుర్గారావు ఆహ్వానం మేరకు గార్డెనియా టవర్స్ లో నాగ చంద్ర కోటేశ్వర శర్మ గారు, శ్రీను గురు స్వామి పౌరోహిత్యం లో శ్రీశ్రీశ్రీ నంద్యాల మోహన గురు స్వామి గారి సారధ్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడి పూజలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు,సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాండు రంగా, దుర్గారావు స్వామి, కసాల అనిల్ గౌడ్, గార ప్రసాద్ రావు, మాధవ్ గురు స్వామి పాల్గొన్నారు.








