Tuesday, January 13, 2026
No menu items!
Advertisement
హోమ్ఆంధ్ర ప్రదేశ్తిరుపతిలో సహాయం పేరుతో విద్యార్థినిపై అత్యాచారం

తిరుపతిలో సహాయం పేరుతో విద్యార్థినిపై అత్యాచారం

ర్యాపిడో డ్రైవర్ అఘాయిత్యం…

తిరుపతిలో సహాయం పేరుతో విద్యార్థినిపై అత్యాచారం
ర్యాపిడో డ్రైవర్ అఘాయిత్యం…
అరెస్ట్ చేసి ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆమె మైన‌ర్ కావ‌డంతో ఫోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు

తిరుపతిలో పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం
హాస్టల్ మారే క్రమంలో పరిచయం పెంచుకున్న నిందితుడు
డబ్బు సాయం పేరుతో గదికి తీసుకెళ్లి అఘాయిత్యం
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
నిందితుడిపై పోక్సో కేసు
తిరుపతి నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాలిటెక్నిక్ చదువుతున్న ఓ మైనర్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సహాయం పేరుతో పరిచయం పెంచుకుని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు భయాందోళనకు గురైంది. చివరకు స్నేహితురాలి సాయంతో పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళితే.. ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని ప్రైవేటు హాస్టల్‌లో ఉంటోంది. ఇటీవలే మరో హాస్టల్‌కు మారేందుకు ఆమె ర్యాపిడో ఆటో బుక్ చేసుకుంది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ సాయికుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆమె ఫోన్ నంబర్ తీసుకున్న సాయికుమార్, తరచూ ఫోన్ చేస్తూ మాటలు కలిపాడు. ఏదైనా అవసరం ఉంటే చెప్పమని నమ్మబలికాడు.

కొన్ని రోజుల తర్వాత బాధితురాలికి డబ్బు అవసరం పడటంతో సాయికుమార్‌ను అడిగింది. దీన్ని అవకాశంగా తీసుకున్న నిందితుడు, ఆమెను తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర భయానికి లోనైన విద్యార్థిని, జరిగిన విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది. ఆమె ధైర్యం చెప్పడంతో అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

బాధితురాలు మైనర్ కావడంతో పోలీసులు నిందితుడు సాయికుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments