అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఎచ్ఏఎల్ కాలనీలో పంబూ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి కృపతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీశైలం గౌడ్ వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్వాములు, కాలనీ వాసులు, భక్తులతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
