Indian Railways:కోచ్‌ అటెండెంట్‌ను కొట్టి చంపిన ప్రయాణికులు

Estimated read time 1 min read

Indian Railways:కోచ్‌ అటెండెంట్‌ను ప్రయాణికులు కొట్టి చంపేశారు.

Indian Railways: బీహార్ నుంచి ఢిల్లీ వెళుతున్న హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో 11 ఏళ్ల బాలికపై రైల్వే ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబీకులు, ప్రయాణికులు అతడిని కొట్టి చంపారు.

కాన్పూర్: బీహార్-ఢిల్లీ ‘హోమాస్ఫర్’ ఎక్స్‌ప్రెస్ రైలులో 11 ఏళ్ల బాలికపై రైల్వే ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబీకులు, ప్రయాణికులు అతడిని కొట్టి హతమార్చారు. బీహార్‌కు చెందిన ఈ బాలిక కుటుంబం సివాన్ నుంచి ఢిల్లీకి రైలులో ప్రయాణిస్తోంది. వారు జనరల్ టిక్కెట్లు తీసుకొన్న వీరు  TTE అనుమతితో AC కోచ్-D లో కూర్చున్నారు. బుధవారం సాయంత్రం రైలు  లక్నోదాటిన తర్వాత  కోచ్‌ అటెండెంట్‌ ప్రశాంత్‌కుమార్‌ ప్రశాంత్ కుమార్ (34) వచ్చాడు.

Indian Railways:కోచ్‌ అటెండెంట్‌ను కొట్టి చంపిన ప్రయాణికులు

ఆ సమయంలో బాలిక తల్లి టాయిలెట్‌కు వెళ్లింది. ఒంటరిగా ఉన్న బాలికపై ప్రశాంత్ కుమార్ అత్యాచారం చేశాడు. చిన్నారి కన్నీరుమున్నీరుగా పారిపోయి తల్లికి విషయం చెప్పింది. ఈ విషయాన్ని అదే రైలులో ప్రయాణిస్తున్న తన భర్తకు చెప్పడంతో యువతి తండ్రి, తోటి ప్రయాణికులు ఆగ్రహంతో నిందితుడిని కొట్టారు. గురువారం ఉదయం రైలు కాన్పూర్‌కు చేరుకోగానే జీఆర్‌పీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న ప్రశాంత్ కుమార్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

You May Also Like

More From Author