Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్సినిమాహైదరాబాద్‌లోనే తొలిరోజుకు రూ. 3 కోట్లకు పైగా బుకింగ్స్

హైదరాబాద్‌లోనే తొలిరోజుకు రూ. 3 కోట్లకు పైగా బుకింగ్స్

బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘అఖండ 2’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై అంచనాలకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి.
24 గంటల్లోనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఏకంగా 1,13,000 టికెట్లు అమ్ముడవగా, కేవలం హైదరాబాద్ నగరంలోనే ‘బుక్ మై షో’ ద్వారా తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ విలువ రూ. 3 కోట్లు దాటింది. ఇంకా ప్రీమియర్ షోల బుకింగ్స్ మొదలుకాలేదు. ఈ ట్రెండ్ చూస్తుంటే, నైజాం ఏరియాలో ఒక సీనియర్ హీరో సినిమాకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కూడా ‘అఖండ 2’ హవా కనిపిస్తోంది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ ప్రీ-సేల్స్ గ్రాస్ సుమారు రూ. 15.5 కోట్లను అధిగమించింది. ఇవి కేవలం ఆన్‌లైన్ బుకింగ్స్ ద్వారా వచ్చిన లెక్కలు మాత్రమేనని, ఆఫ్‌లైన్ అమ్మకాలను కూడా కలిపితే తొలిరోజు వసూళ్లు భారీ స్థాయిలో ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకసారి వాయిదా పడిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments