Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్జిహెచ్​​ఎంసిక్రిస్మస్ శోభ: బాలానగర్‌లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

క్రిస్మస్ శోభ: బాలానగర్‌లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

క్రిస్మస్ శోభ: బాలానగర్‌లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

కూకట్‌పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఉమెన్స్ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో రాజు కాలనీ కమ్యూనిటీ హాల్‌లో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. క్రీస్తు జననం సందర్భంగా ప్రపంచమంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉమెన్స్ క్రిస్టియన్ సెల్ సభ్యురాలు సిస్టర్ మీనా, సునీత, సుకీర్తి ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్త్రీల ఉద్యమం వ్యవస్థాపకురాలు, వాక్యోపదేశకురాలు డా. ధెరెసా పాల్ ముఖ్య అతిథిగా హాజరై, క్రిస్మస్ స్ఫూర్తిని, ఏసుక్రీస్తు ప్రేమ సందేశాన్ని వివరిస్తూ అమూల్యమైన సందేశాన్ని అందించారు.

చిన్నారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ:

సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ థీమ్‌తో చిన్నారులు ధరించిన ప్రత్యేక వేషధారణలు, ఆపై వారు క్రిస్మస్ ప్రత్యేక గీతాలకు చేసిన నృత్యాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి.

ఈ సందర్భంగా, యేసుక్రీస్తు జన్మదినానికి గుర్తుగా కేక్ కట్ చేసి ఉమెన్స్ క్రిస్టియన్ సెల్ సభ్యులు మరియు క్రిస్టియన్ సోదర సోదరీమణులకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో బాలానగర్ డివిజన్‌లోని క్రైస్తవ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని, క్రిస్మస్ ఉత్సవాలను ఆనందోత్సాహాల మధ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్లు విజయ్ బాబు, వైజి. కిషోర్, పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments