Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్Uncategorizedరష్యా పర్యాటకులకు భారత పెద్ద గిఫ్ట్‌

రష్యా పర్యాటకులకు భారత పెద్ద గిఫ్ట్‌

– 30 రోజుల ఉచిత ఈ-టూరిస్ట్ వీసా ప్రకటించిన ప్రధాని మోదీ

– ఇండియా–రష్యా ద్వైపాక్షిక భేటీ ఫలితంగా కీలక నిర్ణయం

అక్షర గళం, హైదరాబాద్:
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. రష్యా పర్యాటకులు భారత్‌కు రావడాన్ని ప్రోత్సహించేందుకు ఉచిత 30 రోజుల ఈ-టూరిస్ట్ వీసా అలాగే గ్రూప్ టూరిస్ట్ వీసా సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ వీసాలకు ఏ విధమైన రుసుము ఉండదని స్పష్టం చేశారు.

– పర్యాటక రంగానికి ఊపందించే నిర్ణయం

మోదీ మాట్లాడుతూ, “రష్యా పౌరులకు ఉచిత ఈ–టూరిస్ట్ వీసా ఇవ్వడం ద్వారా భారత్-రష్యా పర్యాటక సంబంధాలు బలోపేతం అవుతాయి. ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర అవగాహన మరింత పెరుగుతుంది” అని అన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో రష్యన్ టూరిస్టులు గోవా, కేరళ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలను అధికంగా సందర్శిస్తున్నారు. కొత్త వీసా వ్యవస్థ అమల్లోకి వస్తే పర్యాటక సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

–‘విజన్ 2030’ – వాణిజ్య సహకారానికి కొత్త దిశ

భారత్–రష్యా మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు విజన్ 2030 డాక్యుమెంట్‌పై ఇరుదేశాలు సంతకాలు చేశాయని ప్రధాని తెలిపారు.
ఈ ఒప్పందం ద్వారా—
*– ఇరుదేశాల మధ్య వాణిజ్య మార్గాలు విస్తరించనున్నాయి

*– కొత్త పెట్టుబడుల అవకాశాలు తెరుచుకోనున్నాయి

*– ఎనర్జీ, డిఫెన్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో భాగస్వామ్యం పెరగనుంది

భారత్–రష్యా పర్యాటక సంబంధాలు గతంలో…

*– 2019 వరకు రష్యా భారతదేశానికి టాప్ 10 సోర్స్ కంట్రీలలో ఒకటి

*– గోవాలో రష్యన్ టూరిస్టులకు ప్రత్యేక గైడ్‌లు, మెనూలు, సేవలు అందించే పర్యాటక వ్యవస్థ ఏర్పాటైంది

*– కోవిడ్ తర్వాత రష్యన్ పర్యాటక ప్రవాహం కొంత తగ్గినా 2023–24 నుంచి మళ్లీ పెరుగుతోంది

*–ఇప్పుడు ఉచిత ఈ-వీసా నిర్ణయం రష్యన్ టూరిస్టులను మరలా భారీ సంఖ్యలో ఆకర్షించే అవకాశం ఉంది

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments