Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్జిహెచ్​​ఎంసిALLసమగ్ర ప్రణాళికలతో బృహత్ నగరంకు తగ్గట్టు మౌలిక సదుపాయాల కల్పన:

సమగ్ర ప్రణాళికలతో బృహత్ నగరంకు తగ్గట్టు మౌలిక సదుపాయాల కల్పన:

– జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్

అక్షరగళం,హైదరాబాద్ బ్యూరో:హైదరాబాద్ బృహత్ నగరంగా ఆవిర్భవించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ కు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందనీ జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.శుక్రవారం జీహెచ్ఎంసీ నిధులు రూ.6 కోట్లతో హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా మీదుగా నూతనంగా నిర్మించిన చిక్కడపల్లి – దోమల గూడ లింక్ బ్రిడ్జి ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తో కలిసి జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.


కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్,ఎమ్మెల్యే ముఠా గోపాల్ , డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి,కమిషనర్ ఆర్ వి కర్ణన్, అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, స్థానిక కార్పొరేటర్ లు, ఎస్ఈ మోహన్ రెడ్డి , ఈఈ రోహిణి, డిఈఈ రేణుక, ఏఈఈ ప్రశాంత్ లు పాల్గొన్నారు.బ్రిడ్జి ప్రారంభించిన అనంతరం జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…. ఓఆర్ఆర్ లోపల, ఓఆర్ఆర్ ను అనుకుని ఉన్న పురపాలికల విలీనంతో విస్తీర్ణం, జనాభా పరంగా గ్రేటర్ హైదరాబాద్ నగరం దేశంలోనే అతిపెద్ద నగరం గా అవతరించిందని అన్నారు.అతి పెద్ద నగరంలో జనాభాకు తగ్గట్టు రోడ్లు,డ్రైన్ లు, వీధి దీపాలు, పార్క్ లు ఇతరత్రా మౌలిక సదుపాయాలు అభివృద్ధి కి సీఎం సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.జిలా ఇంచార్జీ మంత్రిగా , స్థానిక ప్రజా ప్రతినిధులందరినీ సమన్వయం చేసుకుంటూ నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.రాష్ట్ర స్టేట్ హెడ్ క్వార్టర్ గా, క్యూర్ లోపలి ప్రాంతంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ను ప్రత్యేక ప్రాధాన్యతన నిస్తూ అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తప్పనున్న “దూర” బాధలు
హుస్సేన్ సాగర్ నాలాపై జీహెచ్ఎంసీ నిధులు రూ.6 కోట్లతో లింకు బ్రిడ్జినీ నిర్మించిన చిక్కడపల్లి – దోమల గూడ లింక్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్ దోమలగూడ వైపు గతానికేంటే సగం తక్కువ సమయంలోనే లిబర్టీ, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, సచివాలయంకు వచ్చే వీలుకలుగుతుంది. దూర బాధలు తప్పనున్నాయి. బ్రిడ్జిని అందుబాటులోకి తేవడం పట్ల నాలా ఇరుపక్కల కాలనీల ప్రజల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీకి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments